తెలంగాణలో కొత్తగా నాలుగు పథకాలను రేవంత్ సర్కార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తొలిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులను అధికారులు జారీ చేశారు. దీంతో కొత్త కార్డుల్లోని 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ జరుగుతుంది. తొలిరోజు మండలానికొక గ్రామంలో ఈ రేషన్ కార్డులను జారీ చేశారు. పాత రేషన్ కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది పేర్లను చేర్చినట్లు తెలుస్తోంది.