ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్లో ఆదేశించింది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేజ్రీవాల్ను విచారించేందుకు అంగీకరించడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.