ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. తాజా పురోగతి నేపథ్యంలో ఆదివారం నుంచి ఈ ఒప్పందం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి, యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమని అర్థం చేసుకున్న తర్వాత.. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి ఆమోదించాలని సెక్యూరిటీ కేబినెట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.’ అని ప్రధాని కార్యాలయం పేర్కొంది.