Wednesday, May 13, 2026

ఆఫీసర్లకు కేటీఆర్ వార్నింగ్!

Must Read

కొందరు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారి, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. చట్ట ప్రకారం కాకుండా ఇష్ట ప్రకారం నడుచుకుంటే భవిష్యత్తులో ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ శివారులో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నారా? లేదా? అన్నది హైకోర్టులో చెప్పాలన్నారు. ఫార్మా సిటీ కోసం గతంలో 14 వేల ఎకరాల భూములు కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకున్నామన్నారు. కానీ, రేవంత్ ప్రభుత్వం వచ్చాక.. ఆ భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం, ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం మళ్​లభించబోతున్నారని విమర్శించారు. బతుకమ్మ చీరల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కావాలంటే సీబీఐ ఎంక్వైరీ వేసుకోవాలని సవాల్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -