Thursday, January 15, 2026

ఇంట్లో లేకున్నా రూ.ల‌క్ష క‌రెంట్ బిల్‌

Must Read

అటు రాజ‌కీయాలు ఇటు సినిమాల‌తో బిజీగా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు తాజా ప‌రిణామాల‌పై త‌న గ‌ళం విప్పుతూ వార్త‌ల్లో నిలిచే న‌టి కంగ‌నా ర‌నౌత్. తాజాగా త‌న ఇంటి క‌రెంట్ బిల్లుపై కంగ‌నా వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. త‌న ఇంటికి కరెంట్‌ బిల్లు రూ.లక్ష వ‌చ్చిదంటూ ఫైర్ అవుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ మనాలీలో ఉన్న తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు ఎలా వేశారని అధికారులపై మండిపడుతోంది. తనసలు ఆ ఇంట్లో ఉండ‌నే ఉండ‌ట్లేద‌ని ఎడాపెడా బిల్లు వేసిన ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఈ మేరకు మండిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ కంగనా మాట్లాడుతూ.. మనాలీలో ఉన్న నా ఇంటికి రూ.లక్ష కరెంట్‌ బిల్లు వేశారు. నేను ఉండ‌ని ఇంటికి ఈ రేంజ్‌లో వచ్చిన బిల్లు చూసి షాకయ్యాను. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వ చర్యకు సిగ్గుపడుతున్నా. రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం మనందరి బాధ్యత, అలా చేయాలంటే ఇలాంటి తోడేళ్ల నుంచి మన రాష్ట్రానికి విముక్తి కల్పించాలి అని పిలుపునిచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -