Thursday, January 15, 2026

సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింది – యాంక‌ర్ ఉద‌య‌భాను

Must Read

సీనియ‌ర్ యాంక‌ర్ ఉదయభాను సినీ ప‌రిశ్ర‌మ‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింద‌ని ఆమె పేర్కొన్నారు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించించారు.సినీ పరిశ్రమలో యాంక‌ర్ల‌కు అవకాశాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌లో ఉద‌య‌భాను మాట్లాడుతూ… “ఇదొక్కటే చేశాను, మళ్లీ చేస్తానన్న నమ్మకం లేదు. కార్యక్రమం మన చేతిలో ఉండదు, అంత పెద్ద సిండికేట్ ఎదిగింది” అని వ్యాఖ్యానించారు. గతంలోనూ పరిశ్రమలో కుట్రలు ఉన్నాయంటూ ఆమె ఆరోప‌ణ‌లు చేశారు. కాగా, ప్ర‌స్తుత కాలంలో ఆమె అడ‌పాద‌డ‌పా ఈవెంట్లు చేస్తున్నా పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉద‌య‌భాను చేసిన వ్యాఖ్య‌లు వైరల్‌గా మారాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -