Friday, September 19, 2025

సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింది – యాంక‌ర్ ఉద‌య‌భాను

Must Read

సీనియ‌ర్ యాంక‌ర్ ఉదయభాను సినీ ప‌రిశ్ర‌మ‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింద‌ని ఆమె పేర్కొన్నారు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించించారు.సినీ పరిశ్రమలో యాంక‌ర్ల‌కు అవకాశాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌లో ఉద‌య‌భాను మాట్లాడుతూ… “ఇదొక్కటే చేశాను, మళ్లీ చేస్తానన్న నమ్మకం లేదు. కార్యక్రమం మన చేతిలో ఉండదు, అంత పెద్ద సిండికేట్ ఎదిగింది” అని వ్యాఖ్యానించారు. గతంలోనూ పరిశ్రమలో కుట్రలు ఉన్నాయంటూ ఆమె ఆరోప‌ణ‌లు చేశారు. కాగా, ప్ర‌స్తుత కాలంలో ఆమె అడ‌పాద‌డ‌పా ఈవెంట్లు చేస్తున్నా పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉద‌య‌భాను చేసిన వ్యాఖ్య‌లు వైరల్‌గా మారాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి టీజీ భరత్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -