ఇటీవల పలు నాటకీయ పరిణామాలతో మంచు ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరి కుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆస్తి తగాదాలే ముఖ్య కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో మంచు మనోజ్ ఎమోషనల్ కావడం హాట్ టాపిక్గా మారింది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భైరవం’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈవెంట్ లో అతడిపై ఓ వీడియో ప్రదర్శించారు. అది చూసి మనోజ్ చలించిపోయాడు. ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ‘భైరవం’ సినిమా మే 30న విడుదల కానుంది.