Thursday, March 5, 2026

News

కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి చోటు చేసుకుంది. ఘన్‌పూర్‌లో బుధ‌వారం ఓ షాపు ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు అక్క‌డ‌ బాణాసంచా కాల్చారు. దీంతో ప‌క్క‌న షాపులో ఫ్లెక్సీలు, టెంట్‌కు మంటలు అంటుకొని చెల‌రేగాయి. అక్క‌డే ఉన్న సిబ్బంది స‌కాలంలో స్పందించి మంట‌లు ఆర్పారు.

ఢిల్లీ పార్టీని న‌మ్మితే తెలంగాణ బ‌తుకు సున్నా

ఢిల్లీ పార్టీని న‌మ్మితే తెలంగాణ బ‌తుకు సున్నా అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై , రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువుచేసిన సందర్భమిద‌ని పేర్కొన్నారు. తెలివి లేని...

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును క్వాష్‌ చేయాలని హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హరీశ్‌రావును అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా...

త్రిషకు రేవంత్ సర్కార్ భారీ నజరానా

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని భారత మహిళా క్రికెటర్‌ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ICC మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రిషకు రేవంత్ రెడ్డి రూ.కోటి నజరానా ప్రకటించారు. మరో క్రికెటర్‌ ధ్రుతి కేసరికి రూ.10 లక్షలు ప్రకటించారు. కాగా, భారత్ కప్ గెలవడంతో త్రిష...

కర్ణాటక హైకోర్టులో విజయ్‌ మాల్యా పిటిషన్‌

బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్‌ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని.. దీనికి సంబంధించిన అకౌంట్‌ స్టేట్‌మెంట్లను అందించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తనతో పాటు ప్రస్తుతం లిక్విడేషన్‌లో ఉన్న యూబీహెచ్‌ఎల్‌ తదితర...

4 కోట్లకు చేరువలో తెలంగాణ జనాభా

తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లకు చేరువలో ఉంది. ఇటీవల రేవంత్ సర్కార్ కులగణన సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. జనాభా మూడు కోట్ల 70 లక్షలు దాటింది. ఇప్పటివరకు 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మంది సర్వేలో పాల్గొన్నారు. 16 లక్షల మందికి సంబంధించిన వివరాలు లభ్యం...

కులగణన చేసి చరిత్ర సృష్టించాం: రేవంత్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేసి చరిత్ర సృష్టించామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కులగణన జరపాలని ప్రధానిపై కూడా ఒత్తిడి వస్తోందని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అందించామన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాలతో కమిషన్...

మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి నటుడు మంచు మోహన్ బాబు, మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరినీ విచారణకు రావాలని రంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ ఆదేశించారు. దీంతో సోమవారం మనోజ్ కీలక డాక్యుమెంట్స్ తీసుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లారు. రంగారెడ్డి జిల్లా...

సోనియా గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ‌పై బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పదాలు వాడారని ఆరోపించారు. సోనియా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవానికి భంగం వాటిల్లేవేనని పేర్కొన్నారు. 'సోనియా గాంధీ వాడిన పదాలు రాష్ట్రపతి...

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. పాత, కొత్త బేధాలు లేకుండా అధిష్టానం మధ్యేమార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఫిబ్రవరి 15 కల్లా నూతన అధ్యక్షుడి నియామకం జరగాల్సి ఉండటంతో.. తెరపైకి ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచంద్రారావు, మురళీధర్‌రావు, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. మురళీధర్‌, డీకే అరుణలో...

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...