Tuesday, January 27, 2026

News

కుప్వాడాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ కుప్వాడా జిల్లాలో భద్రతా బలగాలు ఆపరేషన్ పింపుల్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. భారత సైన్యం చినార్ కోర్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని నిఘా సమాచారం...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప‌లు విమాన సర్వీసుల రద్దు

శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దయ్యాయి. సాంకేతిక లోపాలతో అధికారులు సర్వీసులను నిలిపివేశారు. ఢిల్లీ ముంబై శివమొగ్గ విమానాలు రద్దు చేశారు. హైదరాబాద్-కౌలాలంపూర్ వియత్నాం-హైదరాబాద్-గోవా సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక లోపాలతో విమానాలు ఆలస్యమవుతున్నాయి. 24...

నేడు పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనకు బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తర్వాత మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఎర్రచందనం గోడౌన్లను తనిఖీ చేస్తారు. మంగళం ప్రాంతంలోని నిల్వ గోదాములను సందర్శిస్తారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో అటవీశాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరుపుతారు. నిల్వలో ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి...

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి తీవ్ర రోడ్డు దుర్ఘటన సంభవించింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద నేషనల్ హైవేపై పెళ్లి కారు అదుపుతప్పి భీకర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రయాణికులపై కారు దూసుకెళ్లింది. అన్నవరం నుంచి పెళ్లి కార్యక్రమం...

రేవంత్ రెడ్డి పుట్టినరోజున‌ ప్ర‌ముఖుల‌ శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు విషెస్ అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో భారీ సంఖ్యలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ రేవంత్ ఆరోగ్యవంతుడిగా ఉండాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ నేతకు జన్మదిన విషెస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

కేజీహెచ్ ఆసుపత్రి విద్యుత్ అంతరాయంపై వైఎస్ జగన్ విమ‌ర్శ‌లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్టు చేసిన జగన్, విశాఖపట్నం కె.జి.హెచ్ (కింగ్ జార్జ్ హాస్పిటల్) ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం కారణంగా రోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఉదాహరణగా చూపి, ప్రభుత్వ ఆరోగ్య...

బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ టెండర్ల రద్దు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది. అక్టోబర్ 11న టెండర్లు ఆహ్వానించి, 31వ తేదీ వరకు గడువు ఇచ్చినా, తాజాగా రద్దు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం నేపథ్యంలో ఇది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు...

ఎయిర్‌పోర్టుల్లో సాంకేతిక లోపం.. వంద‌లాది సర్వీసులకు అంతరాయం

భారత్‌లోని ప్రధాన ఎయిర్‌పోర్టులలో సాంకేతిక సమస్యలు విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్‌లో లోపం వల్ల సుమారు 800 విమానాలు ఆలస్యమయ్యాయి. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కూడా అడ్వైజరీ జారీ చేసి, ప్రయాణికులు ఆలస్యాలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. సమస్య పరిష్కారానికి సాంకేతిక బృందాలు...

ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌పై చర్యలపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

తెలంగాణలో ఈ ఫార్ములా కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి లేదా చార్జిషీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సవరణల ప్రకారం ఇది అవసరమని తెలిపారు. విచారణకు...

వందేమాతరం 150 ఏళ్ల స్ఫూర్తి: వైఎస్ జగన్ సోషల్ మీడియా పోస్టు

భారత దేశభక్తి గీతం 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రేరణగా నిలిచిందని, తన 'ఎక్స్' అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ పవిత్ర గీతం సమరయోధులలో ఐక్యతా భావనను రగిల్చిందని, ఆ స్ఫూర్తితో...

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...