అమెరికా ఉపరాష్ట్రపతి జేడీ వాన్స్ భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్ నవంబర్ 19న నార్త్ కరోలినాలోని క్యాంప్ లెజ్యూన్ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంలో తీసిన ఫోటోల్లో ఆమె వివాహ ఉంగరం ధరించకపోవడం గమనార్హం. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్తో పక్కపక్కనే ఉన్న ఫోటోల్లోనూ ఉంగరం కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో విడాకుల పుకార్లు...
స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ సింగిల్ “రెబల్ సాబ్” నవంబర్ 23న విడుదల కానుంది. కొత్త పోస్టర్లో వింటేజ్ లుక్లో డ్యాన్స్ వేస్తూ కనిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాడు. తమన్ సంగీతంలో ఈ పాట రాగానే రచ్చ మొదలవుతుందని అభిమానుల ఉత్సాహం. డిసెంబర్లో మరో మూడు...
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో చైనీస్ తైపీ బాక్సర్పై 5-0తో ఘన విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత నిఖత్ గెలుచుకున్న తొలి అంతర్జాతీయ పతకం ఇది. మినాక్షి, ప్రీతి పవార్, అరుంధతి, నూపుర్...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటం బహూకరించిన అనంతరం రాష్ట్రపతి...
తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8.50 వరకు పలుకుతోంది. హోల్సేల్లో 100 గుడ్లు విశాఖలో రూ.673, చిత్తూరు-హైదరాబాద్లో రూ.635కు చేరాయి. ఉత్తర భారతానికి పెరిగిన ఎగుమతులు, వ్యాధులతో కోళ్ల మరణాలు, మిచాంగ్ తుఫాన్ నష్టం కారణంగా ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పార్టీని సంస్థాగతంగా బలపరచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ నిర్మాణ బాధ్యతలను రామ్ తాళ్లూరికి అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని రెండు రాష్ట్రాల్లోనూ విభాగాలవారీగా సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నాయకత్వంలో పూర్తి మార్పు, గ్రామీణం నుంచి పట్టణం వరకు కొత్త ఆర్గనైజేషనల్...
సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు ఐబొమ్మ రవిపై ఫోర్జరీ సహా మరో మూడు సెక్షన్లు జోడించారు. దీనితో మొత్తం 13 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రహ్లాద్ పేరుతో పాన్ కార్డు, బైక్ లైసెన్సు, ఆర్సీ తయారు చేసినట్టు గుర్తించారు. ఐదు రోజుల పోలీసు కస్టడీలో రవిని తీవ్వారు. బ్యాంకు లావాదేవీలు, క్రిప్టో వాలెట్లు, విదేశీ...
2002లో మరణించిన తెలుగు నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి హైకోర్టు తగ్గించిన రెండేళ్ల శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి, శిక్షను మరింత పెంచాలంటూ రెండు అప్పీళ్లు దాఖలయ్యాయి. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం విచారణ పూర్తి చేసి...
గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ భవనం కూల్చివేతపై దాఖలైన ధిక్కార పిటిషన్ విచారణలో తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “చట్టబద్ధంగా నోటీసు ఇవ్వకుండా ఉదయాన్నే ఎందుకు కూల్చారు? హైడ్రాకు అపరిమిత అధికారాలు ఇస్తే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా నియంత్రించలేని పరిస్థితి వస్తుంది” అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికార...
టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 10 గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించారు. అవసరమైతే మళ్లీ హాజరు కావాలని సూచించారు. విచారణ అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ “అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చా....