స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన జయశంకర్ సార్ త్యాగస్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిదని సీఎం గుర్తుచేశారు. అలాగే, తన...
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన నేపథ్యంలో, ఆమోదం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనున్నారు. జంతర్ మంతర్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1...
తెలంగాణ రాష్ట్ర సాధనకై జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్లో.. “తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఉద్యమ చుక్కాని ప్రొఫెసర్...
కాంగ్రెస్ చేపట్టిన ధర్నాపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీసీల పేరుతో చేస్తున్న ఈ ఆందోళన అసలు ముస్లింల రిజర్వేషన్ల కోసం మాత్రమేనని ఆయన ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ అనేది బీసీల కోసం కాదని, అది పూర్తిగా ముస్లింలకు అదనపు రిజర్వేషన్లు కల్పించాలనే కుట్రలో భాగమని అన్నారు. బీసీలకు 5...
భారత్తో ఉన్న బలమైన మైత్రి బంధాన్ని అమెరికా దెబ్బతీయకూడదని రిపబ్లికన్ నాయకురాలు, భారత సంతతి అయిన నిక్కీ హేలీ హితవు పలికారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ తమకు సరైన భాగస్వామి కాదంటూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం సుంకంతో పాటు కఠిన చర్యలు...
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి సెకనుకు 32,059 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 66,131 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం...
మేడిపల్లి పరిధిలో చిన్నారి జీవితాన్ని చీకటిలోకి నెట్టిన సంఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాల ప్రకారం, చిన్న వయసులోనే అక్క, బావల సంరక్షణలో పెరిగిన ఓ బాలిక అక్కడే నివాసముంటోంది. గత ఏడాది పెంపుడు తల్లి మరణించగా, తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో చదువు మానేసి ఇంట్లోనే ఉన్న బాలిక సోషల్ మీడియాలోకి...
పోస్టల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న రిజిస్టర్డ్ పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ పోస్టల్ సేవలు పూర్తిగా బంద్ కానున్నాయి. ఇకపై రిజిస్టర్డ్ పోస్టల్ సర్వీసు స్థానంలో స్పీడ్ పోస్ట్ సేవలనే కొనసాగించనున్నారు. అంటే రిజిస్టర్డ్ పోస్టల్ లేఖలు, పత్రాలు,...
అడవి ఏనుగుల నుంచి పంటలను రక్షంచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో కర్ణాటక నుంచి ఏపీకి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాయి. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి...
దేశ సేవ చేయాలనే యువతకు గొప్ప అవకాశం లభించింది. కాకినాడ నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) మైదానంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నేడు ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ ఈ నెల 20 వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరవుతున్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,...