Tuesday, March 24, 2026

తమిళనాడులో ఎన్డీఏ కూటమి సీట్లు ఖరారు

Must Read

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలవ్వకముందే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. గత కొద్ది రోజులుగా ఎడతెగని ఉత్కంఠకు తెరదించుతూ అన్నాడీఎంకే నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ కూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం జరిగిన కీలక సమావేశం అనంతరం మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల వివరాలను అన్నాడీఎంకే అధికారికంగా వెల్లడించింది. అయితే, తన సొంత పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్యపై మాత్రం అన్నాడీఎంకే పెదవి విప్పకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అమిత్ షా చర్చల తర్వాతే ముందడుగు
ఈ సీట్ల పంపకాల వ్యవహారం అంత సులభంగా తేలలేదు. గత కొన్ని వారాలుగా అన్నాడీఎంకే, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. సీట్ల సంఖ్యపై ప్రతిష్టంభన ఏర్పడటంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే కూటమిలోని విభేదాలు తొలగిపోయి, సీట్ల లెక్కలు ఒక కొలిక్కి వచ్చాయి. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చెన్నైకి చేరుకుని తుది దశ పర్యవేక్షణ చేసిన వెంటనే ఈ ప్రకటన వెలువడింది.

మిత్రపక్షాల వాటా ఇలా..
కూటమి ఒప్పందం ప్రకారం, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడులో 27 స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే, బలమైన ఓటు బ్యాంకు ఉన్న పట్టాలి మక్కల్ కట్చి పార్టీకి 18 సీట్లు కేటాయించారు. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీకి 11 స్థానాలు దక్కాయి. మిగిలిన స్థానాల్లో అత్యధిక భాగం అన్నాడీఎంకే పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ, పార్టీకి పట్టున్న నియోజకవర్గాలను వదులుకోకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే తన వాటాపై ఇంకా అంతర్గత మంతనాలు సాగిస్తూ ప్రకటనను వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

నాపై జ‌రిగిన దాడిపై విచార‌ణ చేప‌ట్టండి – అంబ‌టి రాంబాబు

ఆంధ్రప్రదేశ్‌ మాజీమంత్రి అంబటి రాంబాబు ఇవాళ (మార్చి 23) గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. తన ఇంటిపై దాడి, నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో హింసించడంపై విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -