Monday, May 11, 2026

ముప్పై ఏళ్లలో మీరెందుకు అభివృద్ధి చేయలేదు?

Must Read

రాజకీయం అంటే కేవలం అధికార దాహం కాదు, ప్రజలకు సేవ చేయాలన్న తపన అని మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఆదివారం నగరిలోని తన నివాసంలో పుత్తూరు మున్సిపల్ మాజీ పాలకవర్గ సభ్యుల సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మరియు స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. తన ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా కష్టకాలంలో గడిచిపోయినప్పటికీ, మిగిలిన మూడేళ్లలోనే నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని ఆమె గర్వంగా ప్రకటించారు. గత ముప్పై ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఏలిన నాయకులు ఎందుకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని, కేవలం “దోచుకుందాం.. దాచుకుందాం” అనే ధోరణితోనే పాలన సాగుతోందని ఆమె మండిపడ్డారు. నగరిలో టీటీడీ కళ్యాణ మండపాలు లేని పరిస్థితి నుంచి, నేడు అనేక దేవాలయాల నిర్మాణం వరకు తానే చొరవ తీసుకున్నానని, ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రస్తుత పాలకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -