బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్ ట్రాటర్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మరోసారి స్పందించారు. “రాజమౌళి లాంటి ప్రభావశీల వ్యక్తి మాటలు వ్యక్తిగత అభిప్రాయంగా మిగలవు. లక్షలాది యువత మనసులపై పడతాయి. విశ్వాసం బలహీనత కాదు, వినయం పాతబడలేదు, మన మూలాలను అవమానించడం సృజనాత్మకత కాదు. విజయం విలువలను తగ్గించకూడదు” అంటూ మాధవీలత చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

