ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన 14 కేజీల విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఆరుగురు స్మగ్లర్ల నుంచి ఈ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు తరలిస్తుండగా ఈ దందా బయటపడింది. అనుమానం రాకుండా వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లలో లగేజీ బ్యాగుల్లో దాచి తీసుకొచ్చారు. స్కానింగ్ సమయంలో ప్యాకెట్లు గుర్తించారు. బ్యాంకాక్ కేంద్రంగా ఈ అక్రమ రవాణా జరుగుతోంది. స్మగ్లర్లపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

