Monday, March 2, 2026

వేములవాడ ఆలయంలో భక్తుల దర్శనాలు తాత్కాలిక నిలిపివేత

Must Read

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామునుంచి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులు ఏర్పాటు చేశారు. ఆలయ చుట్టూ పలు చోట్ల ఇప్పటికే రేకులు అమర్చారు. భక్తుల కోసం స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఉంచారు. భీమేశ్వరాలయంలో దర్శనాలు, కోడె మొక్కులు, ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయి. నెల రోజులుగా ఆలయ పరిసరాల్లో కూల్చివేతలు జరుగుతున్నాయి. దక్షిణ, ఉత్తర ప్రాకారాలు, పడమర నైవేద్యశాల, ఈవో కార్యాలయం తొలగించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -