Wednesday, November 19, 2025

తాడిపత్రిలో వైసీపీ నేతపై దాడి

Must Read

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత ఆర్‌సీ ఓబుల్‌రెడ్డి మీద అజ్ఞాత వ్యక్తులు దాడి చేశారు. ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓబుల్‌రెడ్డిని మొదట తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అపస్మారకాలకు గురైన ఆయనను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి మార్చారు. పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసుపత్రికి చేరుకొని ఘటన వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. తాడిపత్రి ప్రాంతంలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ టెన్షన్ నేపథ్యంలో ఈ దాడి వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అని అధికారులు పరిశీలిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -