Thursday, April 16, 2026

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి తీవ్ర రోడ్డు దుర్ఘటన సంభవించింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద నేషనల్ హైవేపై పెళ్లి కారు అదుపుతప్పి భీకర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రయాణికులపై కారు దూసుకెళ్లింది. అన్నవరం నుంచి పెళ్లి కార్యక్రమం ముగించుకుని జగ్గంపేటకు వెళ్తుండగా ముందు టైరు పగిలి నియంత్రణ కోల్పోయింది. ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించగా ఆసుపత్రిలో మరొకరు చనిపోయారు. గాయపడినవారిలో విద్యార్థులు ఉన్నారు. వారికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. గాయాలపాలైనవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -