Monday, June 1, 2026

సీఎం రేవంత్‌కు కొండా సురేఖ క్షమాపణలు

Must Read

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన వివాదంపై క్షమాపణలు చెప్పారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత, అధికారులను బయటకు పంపి, మంత్రులతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంటన్నర సేపు రాజకీయ అంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ, తన శాఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం, కూతురు ఆరోపణలపై స్పందించారు. పోలీసులు తమ ఇంటికి రావడంతో కూతురు ఆవేశంలో ముఖ్యమంత్రిపై మాట్లాడినట్లు చెప్పారు. “మా కుటుంబంలో అపార్థం వచ్చింది. అందరం కలిసి ముందుకు వెళ్తాం. నా కూతురు ఆవేశంలో మాట్లాడినందుకు సీఎంకు క్షమాపణలు చెప్పాను,” అని సురేఖ తెలిపారు. పార్టీలో విభేదాలు సర్దుబాటు చేసుకున్నామని, ఇకపై ఐక్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -