Monday, April 27, 2026

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో58 పోటీ!

Must Read

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. నవంబర్ 11న జరిగే పోలింగ్ కోసం 211 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 81 మంది అర్హత పొందారు. వీరిలో 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ స్థాయిలో అభ్యర్థులు పోటీ చేయడం జూబ్లీహిల్స్ చరిత్రలో తొలిసారి. గతంలో 2009లో 13 మంది, 2014లో 21 మంది, 2018లో 18 మంది, 2023లో 19 మంది పోటీ చేశారు. 2023లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించగా, ఆయన మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, విద్యార్థి సంఘాలు, రైతులు ఈ ఎన్నికలో పాల్గొంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ నిర్వాసితులు 12 మంది, యాచారం ఫార్మాసిటీ భూ నిర్వాసితులు 10 మంది, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు 10 మంది, నిరుద్యోగ జేఏసీ నుంచి 13 మంది, పెన్షన్‌దారుల తరఫున 9 మంది సీనియర్ సిటిజన్లు, తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ అభ్యర్థులు తమ సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఎన్నికను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000, ఇతరులు రూ.10,000 చెల్లించి నామినేషన్లు వేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -