Monday, March 2, 2026

పాక్‌ వైమానిక దాడిలో ఆఫ్ఘన్ క్రికెటర్ల మృతి!

Must Read

పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపింది. ఆఫ్ఘన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఈ దాడిని “అనాగరిక, అనైతిక చర్య”గా ఖండించారు. “ప్రపంచ వేదికపై దేశం కోసం ఆడాలని కలలు కన్న యువకుల మృతి విషాదం,” అని రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహ్మద్ నబీ మాట్లాడుతూ, “ఈ ఘటన ఆఫ్ఘన్ క్రికెట్ కుటుంబానికి, దేశానికి తీవ్ర విషాదం,” అని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ దాడిని “పిరికి చర్య”గా అభివర్ణించింది. ఈ క్రికెటర్లు పాకిస్థాన్-శ్రీలంకతో జరిగే త్రి-దేశాల సిరీస్ కోసం పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు వెళ్తుండగా దాడి జరిగింది. ఈ ఘటనతో ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ నుంచి వైదొలిగింది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -