ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాని తన పర్యటనలో మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా, 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలంలో వాహన రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. హైదరాబాద్-శ్రీశైలం, దోర్నాల-శ్రీశైలం మార్గాల్లో ట్రాఫిక్ను పూర్తిగా బంద్ చేస్తారు. ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో కర్నూలు మీదుగా వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించనున్నారు అధికారులు. కడప నుంచి కర్నూలు, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు పాణ్యం, గడివేముల, మిడ్తూరు, బ్రాహ్మణ కొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మీదుగా ప్రయాణించాలి. నంద్యాల నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు పాణ్యం, బనగానపల్లె, డోన్ మార్గంలో మళ్లించబడతాయి. శ్రీశైలం నుంచి ఆత్మకూరు మీదుగా అనంతపురం వైపు వెళ్లే వాహనాలు బండి ఆత్మకూరు, పాణ్యం, బనగానపల్లె, డోన్ మీదుగా ప్రయాణించాలి. ఆత్మకూరు నుంచి బళ్లారి వైపు వెళ్లే వాహనాలు బ్రాహ్మణ కొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా, శాంతినగర్ మీదుగా మళ్లించబడతాయి. అనంతపురం నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు గుత్తి, జొన్నగిరి, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, నాగలదిన్నె, ఐజ మార్గంలో ప్రయాణించాలి. అనంతపురం నుంచి నంద్యాల వైపు వెళ్లే వాహనాలు డోన్, బనగానపల్లె, నంద్యాల మీదుగా మళ్లించబడతాయి. బళ్లారి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, నాగలదిన్నె, ఐజ మీదుగా ప్రయాణించాలి. నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలు తమ్మరాజుపల్లి, కాల్వబుగ్గ, ఎంబాయి, రామళ్లకోట, వెల్దుర్తి, కర్నూలు మార్గంలో మళ్లించబడతాయి. ఓర్వకల్లు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు కూడా ప్రత్యామ్నాయ రూట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపు నేపథ్యంలో, ప్రయాణికులు మరియు వాహనదారులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగా సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.