Tuesday, October 21, 2025

భారత్‌లో తొలి ‘పశు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్’ ఆవిష్కరణ

Must Read

గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న జంతువులకు తక్షణ చికిత్స అందించేందుకు భారత్‌లో తొలిసారిగా ‘పశు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌’ అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని గోవింద్‌ వల్లభ్‌పంత్‌ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జవహర్‌లాల్‌ సింగ్‌ ఈ సృజనాత్మక కిట్‌ను రూపొందించారు. 72 రకాల ఔషధాలు, అవసరమైన పరికరాలతో కూడిన ఈ కిట్‌ను జబల్‌పుర్‌లోని నానాజీ దేశ్‌ముఖ్‌ వెటర్నరీ సైన్స్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సదస్సులో ప్రొఫెసర్‌ సింగ్‌ ప్రదర్శించారు. మారుమూల ప్రాంతాల్లో పశువులు అనారోగ్యంతో లేదా పాము కాటుకు గురైనప్పుడు సత్వర చికిత్స అందడం కష్టమని, అలాంటి సందర్భాల్లో ఈ కిట్‌ అత్యంత ఉపయోగకరమని ప్రొఫెసర్‌ జవహర్‌లాల్‌ సింగ్‌ తెలిపారు. ఈ కిట్‌ ధర రూ.3,000గా నిర్ణయించగా, దీన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి మధ్యప్రదేశ్‌ పశుగణాభివృద్ధి శాఖ మంత్రికి ఈ కిట్‌ను అందజేశారు. ఈ ఆవిష్కరణ పశు సంరక్షణలో కొత్త అధ్యాయాన్ని తెరవనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -