ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించి, స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. రాత్రి 2 గంటల సమయంలో సుమారు 2 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా, సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించినట్లు వెల్లడించారు. అయితే, రాత్రి సమయం కావడంతో ఈ స్వల్ప ప్రకంపనలు గుర్తించేలోపే తీవ్రత తగ్గినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గతంలో కూడా ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో మరియు గత ఏడాది డిసెంబర్లో ఇలాంటి ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. తాజా భూ ప్రకంపనలపై మరింత సమాచారం సేకరణ జరుగుతోంది.