Monday, January 26, 2026

శ్రీశైలానికి వ‌ర‌ద ప్ర‌వాహం

Must Read

భారీ వర్షాల ప్రభావంతో ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీనితో, ప్రాజెక్టు అధికారులు ఏడు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, స్పిల్‌వే ద్వారా 1,87,208 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, శ్రీశైలం కుడి మరియు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, 65,632 క్యూసెక్కుల నీటిని అదనంగా నాగార్జునసాగర్ వైపు పంపుతున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,17,221 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి చేరుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు శ్రీశైలం జలాశయం నీటిమట్టం 882.10 అడుగులుగా, నిల్వ 199.2737 టీఎంసీలుగా నమోదైంది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరాన్ని బట్టి నీటి విడుదల కొనసాగించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -