Tuesday, April 22, 2025

మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

Must Read

స్టార్ హీరో మ‌హేశ్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో అధికారులు ప‌లు ఆధారాలు సేక‌రించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య ప్రకటనలకు మహేష్ బాబు రూ.5.9 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. అందులో రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్ధతిలో తీసుకున్నట్టు ఈడీ అధికారులకు ఆధారాలు లభించిన‌ట్లు స‌మాచారం. మహేష్ బాబు చేసిన ప్రకటనలను చూసి, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయ‌ని, తెలియక అనేకమంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ, డబ్బును అక్రమమైన పద్ధ‌తిలో స్వీకరించినందుకు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.ల‌క్ష దాటిన ప‌సిడి!

దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యుల‌కు అంద‌న్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధ‌ర‌ కేవ‌లం గ‌త తొమ్మిది నెల‌ల కాలంలోనే రూ.22,000...
- Advertisement -

More Articles Like This

- Advertisement -