Tuesday, June 3, 2025

కర్ణాటక హైకోర్టులో విజయ్‌ మాల్యా పిటిషన్‌

Must Read

బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్‌ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని.. దీనికి సంబంధించిన అకౌంట్‌ స్టేట్‌మెంట్లను అందించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తనతో పాటు ప్రస్తుతం లిక్విడేషన్‌లో ఉన్న యూబీహెచ్‌ఎల్‌ తదితర సంస్థల నుంచి వసూలు చేసిన మొత్తాల వివరాలను అందించాలని కోరారు.

తాజాగా న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సుమారు రూ.6,200 కోట్ల రుణాన్ని తీసుకోగా.. దీనికి సంబంధించి రూ.14 వేల కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు.

వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది. ఇదిలా ఉండగా.. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణాల విషయంలో మోసం చేసినట్లు విజయ్‌ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశం విడిచి వెళ్లిపోయిన ఆయన మార్చి 2016 నుంచీ బ్రిటన్‌లో నివసిస్తున్నారు. మాల్యాను భారత్‌కు రప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తూన్న విషయం విదితమే.

- Advertisement -
- Advertisement -
Latest News

హైద‌రాబాద్‌లో కానిస్టేబుల్ డ్ర‌గ్స్ దందా

తెలంగాణ ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నా అక్క‌డ‌క్క‌డా డ్ర‌గ్స్ వినియోగం, అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం క‌ల‌కలం రేపుతోంది. తాజాగా ఓ కానిస్టేబుల్ డ్ర‌గ్స్ విక్ర‌యించ‌డం చ‌ర్చ‌కు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -