Tuesday, April 28, 2026

కుంభమేళాతో 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి

Must Read

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో యూపీలోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. ఈనెల13న మొదలై ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి 40 కోట్ల మందికిపైగా భక్తులు వచ్చి, పుణ్యస్నానాలు ఆచరించనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో భక్తజనసంద్రమైన ప్రయాగ్‌రాజ్‌.. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్‌ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ అంచనా వేసింది. ఒక్క పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5 లక్షల మందికి ఉపాధి లభించొచ్చని అన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -