గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీకి తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 4 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిస్తూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్లో రూ.150 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 11 నుంచి 19వ తేదీ వరకు ఐదు షోలకు అనుమతిస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్లో రూ.100 చొప్పున పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.