Sunday, June 1, 2025

భారత్‌లో విజృంభిస్తున్న HMPV వైరస్

Must Read

భారత్‌లో HMPV వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశంలో నాలుగు HMPV వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు HMPV వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్ చాంద్‌ఖేడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండేళ్ల చిన్నారి ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఐదు నెలల చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. చిన్నారులపైనే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. HMPV కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -