బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బిహార్లోని పాట్నాలోని గాంధీ మైదాన్లో గత నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిశోర్ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి.. ఆస్పత్రికి తరలించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. చట్టవిరుద్ధంగా నిరసన చేపట్టినందువల్ల ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.