Friday, July 4, 2025

భద్రాచలం కాంగ్రెస్ లో వర్గ పోరు!

Must Read

భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నెలకొంది. కేడర్ అంతా పాత, కొత్త వర్గాలుగా మారిపోయారు. అక్కడి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారు గుర్తుపై గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొదెం వీరయ్యకు ప్రభుత్వం అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది. అయితే, నియోజకవర్గంలో తెల్లం వెంకట్రావు వర్గీయులు, పొదెం వీరయ్య వర్గీయుల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇటీవల ఇందిరమ్మ కమిటీల్లో కొత్త కాంగ్రెస్ వర్గీయులకే చోటు దక్కడంపై, పాత కాంగ్రెస్ కేడర్ భగ్గుమంటోంది. దీంతో తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జీతాల కోసం టీచ‌ర్ల నిర‌స‌న‌.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీలో యోగా టీచ‌ర్లు జీతాల కోసం రోడ్డెక్కారు. గ‌త రెండు రోజులుగా విజ‌య‌వాడ‌లోని సీఎం చంద్ర‌బాబు ఇంటి ఎదుట నిర‌స‌న తెలుపుతున్న విష‌యం తెలిసిందే. కాగా,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -