రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరానికి రూ.12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. భూవిస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. ROFR పట్టాదారులకు కూడా సాయం అందజేయనున్నారు. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నట్లు రేవంత్ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.