ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరు దేశాల బంధం బలోపేతానికి సంబంధించి పలు చర్చల్లో భారత ప్రధాని మోదీ, సుబియాంటో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రబోవో సుబియాంటో గతేడాది అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. గతేడాది రిపబ్లిక్ డేకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చీఫ్ గెస్ట్గా హాజరైన సంగతి తెలిసిందే.