Thursday, November 27, 2025

కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డిపై సిట్ విచార‌ణ‌

Must Read

టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 10 గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించారు. అవసరమైతే మళ్లీ హాజరు కావాలని సూచించారు. విచారణ అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ “అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చా. కల్తీ నెయ్యి వాస్తవాలు బయటపడాలనే సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశా. అవినీతి చేయాలంటే కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి, నెయ్యి ఎందుకు?” అని ప్రశ్నించారు. 2014 నుంచి నెయ్యి సరఫరాలపైనా విచారణ జరపాలని, తన పీఏ కాదని 2018 నుంచే అప్పన్న అని స్పష్టం చేశారు. ఎప్పుడైనా పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజ్యాంగ దినోత్సవం సంద‌ర్భంగా అంబేద్కర్‌కు జగన్ నివాళి

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -