ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్లో మహాసమాధిని దర్శించుకున్న అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రూ.100 స్మారక నాణెం, నాలుగు తపాలా బిళ్లలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యా రాయ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

