ఆంధ్రప్రదేశ్లోని టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై టీడీపీ, వైసీపీ రాజకీయం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే మృతి చెందిన గోవుల జాబితాను గోశాల మేనేజర్ విడుదల చేశారు. ఈ ఏడాదిలో 191 గోవులు మరణించినట్లు ప్రకటన చేశారు. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు 191 ఆవులు మృతి చెందినట్లు పేర్కొన్నారు.జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొత్తం 45 ఆవులు చనిపోయినట్లు స్పష్టం చేశారు.