లింగాల పోలీస్ స్టేషన్ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నా చేపట్టారు. వారం రోజులుగా రైతుల మోటార్ల వైర్లు అపహరణకు గురవుతున్నాయి. గత రాత్రి 25 మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ అయ్యాయి. రైతులకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి ఆందోళన చేశారు. రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. నిందితులను వెంటనే అరెస్టు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

