Monday, March 2, 2026

మోదీ నాయకత్వంలోనే భారత్‌ అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

Must Read

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తును కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నన్నూరు వద్ద జరిగిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ హాజరయ్యారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు లాభం చేకూరిందని, 99% వస్తువులపై 5% లోపు జీఎస్టీ విధిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ 2047 నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందని, ఇప్పటికే 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలు, మెగా డీఎస్సీ, పీఎం కిసాన్ వంటి కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని వివరించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -