ఇటీవల మెట్రో చార్జీలు పెంచి ప్రయాణికులకు షాకిచ్చిన మెట్రో యాజమాన్యం ఇప్పుడు ప్రయాణికులకు ఓ శుభవార్త తెలిపింది. హైదరాబాద్ మెట్రో పెంచిన చార్జీలను సవరిస్తూ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన చార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. మెట్రో సంస్థ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.