Saturday, July 5, 2025

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

Must Read

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల నుంచి సినిమాలు చేయ‌డం లేదు. దీంతో ఆర్థికంగా ఆయ‌న ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న‌ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. తండ్రి అనారోగ్యం గురించి చెప్పి బాధ‌ప‌డుతూ ఆయ‌న కుమార్తె స్రవంతి ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వేడుకున్నారు. దీనికి స్పందించిన హీరో ప్రభాస్ అసిస్టెంట్ ఒకరు కాల్ చేశార‌ని ఆమె తెలిపింది. ఎవరైనా కిడ్నీ ఇచ్చే డోనర్ ను వెతకండి. మీ నాన్నగారి ఆపరేషన్ కు కావల్సిన రూ. 50 లక్షలు మేము ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న చెప్పినట్లు స్రవంతి తెలిపింది. ఫిష్ వెంకట్ భార్య మాత్రం గబ్బర్ సింగ్ గ్యాంగ్ తప్ప ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ నుండి ఎవ్వరు రాలేద‌ని, ఫోన్ చెయ్యలేద‌ని చెప్పారని స‌మాచారం. దీనిపై ప్రభాస్ టీమ్ ను వివరణ కోరగా అసలు తమ టీమ్ నుండి కాల్ చేయలేదని తెలిపారు. ఏదైనా ఉంటె తాము మీడియా ద్వారా అధికారకంగా తెలియజేస్తామని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

ఇటీవ‌ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో య‌శోద ఆస్ప‌త్రిలో చేరిన మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్ప‌త్రి నుంచి నేడు డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య...
- Advertisement -

More Articles Like This

- Advertisement -