తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. క్వార్టర్ పై రూ.10, హాఫ్ బాటిల్ పై రూ.20 ,ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచినట్లు సమాచారం.ఇటీవల ప్రభుత్వం బీర్లపై 15 శాతం ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు లిక్కర్పైనా పెంచడంతో మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.