Home News రూ.ల‌క్ష దాటిన ప‌సిడి!

రూ.ల‌క్ష దాటిన ప‌సిడి!

0
6

దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యుల‌కు అంద‌న్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధ‌ర‌ కేవ‌లం గ‌త తొమ్మిది నెల‌ల కాలంలోనే రూ.22,000 వేల‌కు పైగా పెరిగిపోయింది. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,00,015 ఉన్న‌ది. ఇదే 10 గ్రాముల బంగారం ధ‌ర గ‌తేడాది జులై 22న రూ.77,500 గా ఉన్న‌ది. మ‌రో వైపు ఈ ఏడాది బంగారం ధ‌ర రూ.ల‌క్ష 25 వేల‌కు చేరుకుంటుంద‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు.