Friday, January 16, 2026

ఏనుగుల దాడిలో రైతు మృతి

Must Read

కుప్పం మండలం కుర్మానిపల్లిలో ఏనుగుల దాడిలో రైతు కిట్టప్ప మృతి చెందాడు. రాగి పంటకు కాపలా కాస్తున్న సమయంలో ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనతో పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల నుంచి రైతులను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బంగారుపాళెం మండలం టేకుమందలో సోమవారం రాత్రి ఏనుగులు పంట పొలాలపై దాడి చేశాయి. కౌండిణ్య అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు మామిడి మానుల ద్వారా పొలాలకు చేరాయి. పరదేశి, కౌసల్య, గోవిందయ్య, రేణుకమ్మలకు చెందిన నాలుగు ఎకరాల వరి మడిని తొక్కేశాయి. అరటి చెట్లను కూడా నాశనం చేశాయి. అప్పులు చేసి పంటలు పండించామని, ప్రభుత్వం సహాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -