తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు నగరంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్ ద్వారా వరంగల్కు చేరుకోనున్నారు. ఆ తర్వాత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమం వడ్డేపల్లి పీజీఆర్ గార్డెన్లో జరగనుంది, ఇందులో సీఎం మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 గంటల వరకు పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సీఎం పర్యటన సజావుగా సాగేలా వరంగల్ నగరంలో అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు.