Thursday, January 15, 2026

కర్నూలు ప్రమాదం ఎఫెక్ట్‌తో తెలంగాణలో బస్సుల తనిఖీలు

Must Read

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు తీవ్రతరం చేశారు. విజయవాడ, బెంగళూరు హైవేలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజేంద్రనగర్‌లోని గగన్‌పహాడ్, ఎల్బీ నగర్‌లోని చింతలకుంట వద్ద బస్సులను పరిశీలించారు. ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లు, వాహన నిబంధనలను తనిఖీ చేసిన అధికారులు, నిబంధనలు అతిక్రమించిన ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఒక బస్సు అద్దం పగిలినా నడుపుతుండగా, దాన్ని సీజ్ చేశారు. మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆర్సీ, ఫిట్‌నెస్, బీమా, పర్మిట్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే, ప్రమాదం తర్వాతే అధికారులు చర్యలు చేపట్టడంపై ప్రయాణికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -