Wednesday, November 19, 2025

కర్నూలు ఆస్ప‌త్రిలోనే బస్సు ప్రమాద మృత‌దేహాలు

Must Read

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో నిద్రలో ఉన్నవారు సజీవ దహనానికి గురయ్యారు. తీవ్రంగా దెబ్బతిన్న మృతదేహాలను గుర్తించడం సవాలుగా మారింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 19 మృతదేహాలు పోస్టుమార్టం గదిలో ఉన్నాయి. వైద్యులు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ఇప్పటివరకు 19 మృతదేహాల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించగా, 11 మృతదేహాలకు సంబంధించి బంధువుల నమూనాలను కూడా సేకరించారు. ఈ నమూనాలను మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మిగిలిన మృతదేహాల బంధువుల నుంచి నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉంది, దీంతో మృతదేహాల అప్పగింత ఆలస్యం కానుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -