Tuesday, January 27, 2026

ఎస్సైపై అట్రాసిటీ కేసు నమోదు

Must Read

వరంగల్ నగరంలో పోలీసులపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాల ప్రకారం, ఈ నెల 22న అర్ధరాత్రి మిల్స్ కాలనీ ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్న దళిత మహిళ మరియమ్మపై దాడి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొత్త అదనపు ఎస్పీ శుభం పర్యవేక్షణలో కొనసాగుతోంది. అయితే, మరోవైపు ఎస్సై శ్రీకాంత్ ఫిర్యాదు ఆధారంగా మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పై కూడా కేసు నమోదు కావడంతో ఈ సంఘటనపై వివాదం మరింత ముదిరింది. స్థానికంగా ప్రజలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -