Tuesday, January 27, 2026

రేవతి మరణించినట్లు నాకు చెప్పలేదు

Must Read

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు 20 ప్రశ్నలు సంధించారు. మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసుల ప్రశ్నలకు అల్లు అర్జున్ సూటిగా సమాధానం ఇచ్చారు. రేవతి మరణించినట్లు థియేటర్ లో తనకెవరూ చెప్పలేదని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ ను సందర్శిస్తున్నట్లు యాజమాన్యం అనుమతిని పోలీసులు తిరస్కరించారనే సమాచారం తనకు లేదన్నారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని తెలిపారు. రేవతి మరణం పట్ల పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని మీడియాకు తప్పుడు సమాచారం వెళ్లిందన్నారు. కాగా ఒంటరిగానే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -