Thursday, January 15, 2026

ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్ట్

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు నెట్‌వర్క్‌పై పోలీసులు భారీ దాడులు చేస్తూ పెను ప్రభావం చూపారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీనియర్ మావోయిస్టు నేత మడకం హిడ్మా, ఆయన భార్య హేమా పండిత్ సహా ఆరుగురు మరణించారు. బుధవారం మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటెలిజెన్స్ ADG మహేష్ చంద్ర లడ్డా.. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలలుగా నిఘా ఉధృతం చేశామని, ఈ ఆపరేషన్ పూర్తిగా ఏపీ పోలీసులదేనని స్పష్టం చేశారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 50 మంది ఛత్తీస్‌గఢ్ మూలాలున్న మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టు రిక్రూట్‌మెంట్ పూర్తిగా స్తంభించిందని, 2026 మార్చి 31లోగా మావోయిస్టు సమస్యను పూర్తిగా అంతం చేస్తామని లడ్డా ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -